
'స్టైలిష్ స్టార్' అల్లు అర్జున్ ఇటీవల “పలాస 1978” చూసారు. ఈ చిత్రాన్ని చూసాక దర్శకుడు కరుణ కుమార్ ని కలిసి అభినందించారు. ఈ సినిమా ఎంటైర్ టీమ్ కు స్పెషల్ గా కంగ్రాట్స్ చెప్పానని ట్వీట్ చేసాడు.
"ధ్యాన్ అట్లూరి","మనోజ్ కుమార్" సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి "కరుణ కుమార్" దర్శకుడు.
రక్షిత్, నక్షత్ర త్రినయని హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి రఘు కుంచె సంగీతం సమకూర్చారు. అరుల్ విన్సెంట్ ఛాయగ్రహకుడిగా పనిచేయాగా, విజయ్ కొరియోగ్రఫీ అందించారు.
Congratulations to the entire team of Palasa 1978. Watched it and met the director the very next morning. Wonderful attempt with a great underlying message. It had so many good moments . I personally liked it . pic.twitter.com/gjoqYcxxKm
— Allu Arjun (@alluarjun) October 2, 2020
మన టాలీవుడ్ హీరోలు కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చెయ్యడంలో ఎప్పుడూ ముందే ఉంటారు. అలాంటి వారిలో 'స్టైలిష్ స్టార్' అల్లు అర్జున్ కూడా ఒకరు. అయితే ఈ ఏడాది మార్చ్ లో విడుదల అయిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దీనితో ఈ చిత్ర దర్శకుడిని పలువురు ఇండస్ట్రీ పెద్దలు అభినందించారు. ఇప్పుడు అదే వరసలో అల్లు అర్జున్ లాంటి బిగ్ స్టార్ ఈ చిత్రాన్ని చూసి ఆ దర్శకుడిని, టీంని అభినందించడమనేది చాలా గొప్ప విషయం. మంచి సందేశంతో తెరకెక్కిన ఈ చిత్రం అందరి ప్రశంసలు అందుకుంటూంది.
అలాగే ఈ చిత్రంలోని 'నాది నక్కిలీసు గొలుసు' పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఇలాంటి మంచి చిత్రాన్ని అందించిన దర్శకుడికి,ఈ చిత్ర నిర్మాతలకి, యూనిట్ కి ఆల్ ది బెస్ట్.